విద్యార్థులు క్రీడల్లో రాణించాలి : రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సెక్రటరీ పద్మా రెడ్డి
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సెక్రటరీ పద్మా రెడ్డి
ప్రజాక్షేత్ర్ , వెబ్ న్యూస్
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సెక్రటరీ పద్మా రెడ్డి అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ , సమయ పాలన, క్రీడా స్పూర్తి అలవడుతుందన్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ సెక్రటరీ పద్మా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీని, నగదు బహుమతిని అదంజేశారు. రెండవ స్థానంలో నిలిచిన రన్నరప్కు నగదు బహమతిని అందజేశారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ క్రీడా స్పూర్తి ద్వారా విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను తేలికగా అధికమించగలుగుతారన్నారు. జిల్లా , రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోను సత్తా చాటాలని ఆయన పిలుపు నిచ్చారు.