Prajakshethre News & Latest Posts https://prajakshethrenews.com/rss/latest-posts Prajakshethre News & Latest Posts en Copyright 2024 Prajakshethre News & All Rights Reserved. జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న శ్రీ వెంకరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ భాషెట్టి లెనిన్ బాబు https://prajakshethrenews.com/జాతీయ-పతాకాన్ని-ఎగురవేస్తున్న-శ్రీ-వెంకరేశ్వరస్వామి-దేవాలయం-చైర్మన్-భాషెట్టి-లెనిన్-బాబు https://prajakshethrenews.com/జాతీయ-పతాకాన్ని-ఎగురవేస్తున్న-శ్రీ-వెంకరేశ్వరస్వామి-దేవాలయం-చైర్మన్-భాషెట్టి-లెనిన్-బాబు పాతబస్తీ ఫూల్ బాగ్ చమన్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న  శ్రీ వెంకరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ భాషెట్టి లెనిన్ బాబు 

]]>
Mon, 27 Jan 2025 08:04:39 +0530 admin
త్రివర్ణపతకాన్ని ఆవిష్కరించిన చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇంచార్జి బోయ నగేష్ https://prajakshethrenews.com/త్రివర్ణపతకాన్ని-ఆవిష్కరించిన-చాంద్రాయణ-గుట్ట-నియోజకవర్గం-ఇంచార్జి-బోయ-నగేష్ https://prajakshethrenews.com/త్రివర్ణపతకాన్ని-ఆవిష్కరించిన-చాంద్రాయణ-గుట్ట-నియోజకవర్గం-ఇంచార్జి-బోయ-నగేష్ పాతబస్తీ గౌస్ నగర్ లో  జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణపతకాన్ని ఆవిష్కరించిన చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇంచార్జి బోయ నగేష్ తదితరులు.

]]>
Mon, 27 Jan 2025 07:56:26 +0530 admin
అర్థరాత్రి నుంచి రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బులు జమ : సీఎం రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/అర్థరాత్రి-నుంచి-రైతు-ఖాతాల్లో-ప్రతి-ఎకరాకు-6-వేల-చొప్పున-డబ్బులు-జమ-సీఎం-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/అర్థరాత్రి-నుంచి-రైతు-ఖాతాల్లో-ప్రతి-ఎకరాకు-6-వేల-చొప్పున-డబ్బులు-జమ-సీఎం-రేవంత్రెడ్డి అర్థరాత్రి నుంచి రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బులు జమ : సీఎం రేవంత్​రెడ్డి

ప్రజాక్షేత్ర్ , వెబ్​ న్యూస్​  

ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాష్ట్రానికి అంకితం చేశారు. జనవరి 26 న బ్యాంకులకు సెలవు రోజు అయినందున అర్థరాత్రి తర్వాత రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బు జమవుతుందని చెప్పారు. 

]]> Sun, 26 Jan 2025 19:53:38 +0530 admin అంగరంగ వైభవంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-శ్రీ-నల్లపోచమ్మ-అమ్మవారి-కళ్యాణ-వేడుకలు https://prajakshethrenews.com/అంగరంగ-వైభవంగా-శ్రీ-నల్లపోచమ్మ-అమ్మవారి-కళ్యాణ-వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు

అగ్నిగుండాలపై నడుచుకుంటూ వెళ్లిన శివసత్తులు, భక్తులు 

పాతబస్తీ అలియాబాద్​ మేకల్​బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో శ్రీ నల్లపోచమ్మ దేవి పాదుక ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత డిసెంబర్​ 10వ తేదీన రాత్రి నేల మీద పసుపు పై అమ్మవారి పాదముద్ర ప్రత్యక్షమైనందున జనవరి 22వ తేదీ నుంచి ఆలయంలో శ్రీ నల్లపోచమ్మ దేవి పాదుక ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పొన్న వెంకటరమణ ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు, అమ్మవారి పటం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శివ నామాన్ని జపిస్తూ ఉత్సవ మూర్తులను తీసుకుని శివసత్తులతో పాటు .... భక్తులు అగ్నిగుండం మీదుగా నడుచుకుంటూ వెళ్లారు. చిన్న పిల్లలు సైతం అగ్నిగుండం మీదుగా నడవడం వారికి అమ్మవారిపై ఉన్న  భక్తికి నిదర్శనం. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

]]>
Sun, 26 Jan 2025 19:19:06 +0530 admin
పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/పాత-నగరం-నిజానికి-ఓల్డ్-కాదు-ఒరిజినల్-సిటీ-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/పాత-నగరం-నిజానికి-ఓల్డ్-కాదు-ఒరిజినల్-సిటీ-రేవంత్-రెడ్డి పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ బ్యూరో : 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల అత్యంత పొడవైన పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌ నిర్మితమైతే, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కిలోమీటర్ల మేర రెండో అతిపొడవైన  డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించామని, తద్వారా తమకు తామే పోటీ అని నిరూపించుకున్నట్టయిందన్నారు.నూతనంగా నిర్మించిన ఆరాంఘర్-జూపార్క్ 4కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ , స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్తో  కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలో రూ.301 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి సీఎం గారు మాట్లాడారు.

]]> Mon, 06 Jan 2025 23:08:32 +0530 admin ఆకర్షించిన టీయూడబ్ల్యూజే పోరాటాలు https://prajakshethrenews.com/ఆకర్షించిన-టీయూడబ్ల్యూజే-పోరాటాలు https://prajakshethrenews.com/ఆకర్షించిన-టీయూడబ్ల్యూజే-పోరాటాలు *టీయూడబ్ల్యూజే పోరాటాలు* *ఆకర్షించాయి* 

*దానికి అనుబంధంగానే పని చేస్తాం*

*- తెలంగాణ వీడియో జర్నలిస్టుల* *అసోసియేషన్ వెల్లడి*

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ-IJU) అవిశ్రాంతంగా పోరాడడం తమను ఎంతో ఆకర్షించిందని, ఈ నేపథ్యంలోనే ఆ సంఘానికి అనుబంధంగా పనిచేసేందుకు తమ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని తెలంగాణ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు. శనివారం బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన  అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో  అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి హరీష్ లు తమ నిర్ణయాన్ని సభా ముఖంగా ప్రకటించి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీకి లేఖను అందించారు.ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ వీడియో జర్నలిస్టులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. వీడియో జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజె ఉప ప్రధాన కార్యదర్శి కె రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె.శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరి, హెచ్.యూ.జె.అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్,  హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి హరిప్రసాద్, టీయూడబ్ల్యూజె మహిళ విభాగం బాధ్యురాలు కల్యాణం రాజేశ్వరిలతో పాటు వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

]]>
Sat, 04 Jan 2025 22:15:00 +0530 admin
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ ని ఆవిష్కరించిన సీ ఎం https://prajakshethrenews.com/తెలంగాణ-గెజిటెడ్-ఆఫీసర్స్-అసోసియేషన్-2025-డైరీ-ని-ఆవిష్కరించిన-సీ-ఎం https://prajakshethrenews.com/తెలంగాణ-గెజిటెడ్-ఆఫీసర్స్-అసోసియేషన్-2025-డైరీ-ని-ఆవిష్కరించిన-సీ-ఎం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ ని  ఆవిష్కరించిన సీ ఎం 

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని, ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు. 

రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని అన్నారు. ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, వారికి నష్టం కలిగించే పనులు ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖు జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం.

ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

ప్రభుత్వంలో కనీస అవసరాలకు ప్రతీ నెల రూ. 22,500 కోట్లు అవసరం ఉండగా, రూ. 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. ఇంకా రూ. 4,000 కోట్ల లోటు ఉంటోంది. 

వచ్చే ఆదాయంలో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ. 6,500 కోట్లు ప్రతి నెల అప్పులు చెల్లిస్తుండగా, మిగిలిన రూ. 5,500 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.

నిజానికి ప్రభుత్వం అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే నెలకు రూ. 30 వేల కోట్లు అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం మనందరిది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్యోగుల సహకారం కావాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి.

ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని ఒక కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కొందరు రాజకీయాల కోసం నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని, అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద పనిచేస్తోంది. అందులో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధం చేసే అవకాశం లేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా ప్రభుత్వానికి చేయలేని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , నాయిని రాజేందర్ తో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Fri, 03 Jan 2025 23:22:48 +0530 admin
అర్జున అవార్డు 2024 కు ఎంపికయిన దీప్తి జీవాంజీ కి సీఎం అభినందనలు https://prajakshethrenews.com/అర్జున-అవార్డు-2024-కు ఎంపికయిన -దీప్తి-జీవాంజీ-కి-సీఎం-అభినందనలు https://prajakshethrenews.com/అర్జున-అవార్డు-2024-కు ఎంపికయిన -దీప్తి-జీవాంజీ-కి-సీఎం-అభినందనలు అర్జున అవార్డు 2024  గ్రహీత దీప్తి జీవాంజీ కి సీఎం అభినందనలు 

పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి  విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ కి రూ. 10 లక్షల నగదు బహుమతిని గతంలోనే అందజేశారు. అదే సమయంలో దీప్తి గారికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వరం‌గల్‌లో 500 గజాల స్థలం కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.తెలంగాణ యువ క్రీడాకారులు మరింతగా రాణించాలని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మితం కానున్న స్పోర్ట్స్ కాంప్లెక్సులు అందుకు దోహదపడతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.అలాగే, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేష్ (చెస్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. 2024 లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

]]>
Fri, 03 Jan 2025 09:12:25 +0530 admin
ఏపీ డిప్యూటీ సీ ఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన నీరబ్ ప్రసాద్ కుమార్ ఐఏఎస్ https://prajakshethrenews.com/ఏపీ-డిప్యూటీ-సీ-ఎం-పవన్-కళ్యాణ్-ను-కలిసిన-నీరబ్-ప్రసాద్-కుమార్-ఐఏఎస్ https://prajakshethrenews.com/ఏపీ-డిప్యూటీ-సీ-ఎం-పవన్-కళ్యాణ్-ను-కలిసిన-నీరబ్-ప్రసాద్-కుమార్-ఐఏఎస్ ఏపీ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) పదవీ విరమణ చేసిన నీరబ్ ప్రసాద్ కుమార్ ఐఏఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా నిబద్ధతతో, అంకిత భావంతో రాష్ట్రానికి సేవలందించిన ఆయనను పవన్ కళ్యాణ్ అభినందించారు.

]]>
Thu, 02 Jan 2025 19:16:22 +0530 admin
*టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి* https://prajakshethrenews.com/టీయూడబ్ల్యూజే-డైరీని-ఆవిష్కరించిన-మంత్రి-పొంగులేటి https://prajakshethrenews.com/టీయూడబ్ల్యూజే-డైరీని-ఆవిష్కరించిన-మంత్రి-పొంగులేటి *టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి*

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ : 

సమగ్ర మీడియా సమాచారంతో, దాదాపు నలభై యేండ్లుగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘ ఆనవాయితీగా డైరీని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 మీడియా డైరీని గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్ లో సమాచార శాఖ కమిషనర్ ఎస్. హరీష్ తో కలిసి ఆవిష్కరించారు.ఈ  కార్యక్రమంలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు,  కార్యదర్శి కె. శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డికి, సమాచార శాఖ కమిషనర్ హరీష్ కు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. విరాహత్ అలీ, కె. రాంనారాయణ లు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

]]>
Thu, 02 Jan 2025 13:31:44 +0530 admin
అయ్యప్ప పడి పూజలో శ్రీ అయ్యప్ప దివ్య రూపం https://prajakshethrenews.com/అయ్యప్ప-పడి-పూజలో-శ్రీ-అయ్యప్ప-దివ్య-రూపం https://prajakshethrenews.com/అయ్యప్ప-పడి-పూజలో-శ్రీ-అయ్యప్ప-దివ్య-రూపం అయ్యప్ప పడి పూజలో శ్రీ అయ్యప్ప దివ్య రూపం 

పాతబస్తీ రాఘవేంద్ర స్వామినగర్ లో జెమ్మిచెట్టు సన్నిధానంలో జెమ్మిచెట్టు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో నీలేష్ కన్నె స్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజలో ప్రత్యక్షమయిన శ్రీ అయ్యప్ప దివ్య రూపం దృశ్యం.

]]>
Wed, 01 Jan 2025 12:59:05 +0530 admin
ఎపి సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ సీ ఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఎపి-సీఎంకి-కృతజ్ఞతలు-తెలిపిన-తెలంగాణ-సీ-ఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఎపి-సీఎంకి-కృతజ్ఞతలు-తెలిపిన-తెలంగాణ-సీ-ఎం-రేవంత్-రెడ్డి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (MP/MLC/MLA) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  తెలంగాణ ముఖ్యమంత్రి కి ప్రత్యుత్తరం రాశారు.తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గుర్తుచేశారు.గత సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని  రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖలో కోరారు.శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు.ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు నాయుడు  రాసిన లేఖలో పేర్కొన్నారు.

]]>
Wed, 01 Jan 2025 12:53:31 +0530 admin
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఉద్యోగుల-సమస్యలను-పరిష్కరించడానికి-ప్రభుత్వం-సిద్ధంగా-ఉంది-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఉద్యోగుల-సమస్యలను-పరిష్కరించడానికి-ప్రభుత్వం-సిద్ధంగా-ఉంది-రేవంత్-రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు తో కలిసి సీఎం సమావేశమయ్యారు.ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన కోసం కేబినేట్ సబ్ కమిటీని నియమించారు.ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.దీపావళి తర్వాత శాఖల వారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినేట్ సబ్ కమిటీ సమావేశమవుతుంది.జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే  సమర్పించిన నివేదికపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.జేఏసీ ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sat, 26 Oct 2024 22:59:23 +0530 admin
రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/రైజింగ్-తెలంగాణ-రైజింగ్-హైదరాబాద్గా-తీర్చిద్దడంలో-అందరూ-సహకరించండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/రైజింగ్-తెలంగాణ-రైజింగ్-హైదరాబాద్గా-తీర్చిద్దడంలో-అందరూ-సహకరించండి-రేవంత్-రెడ్డి రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.ABP Network మీడియా సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన ది సదరన్ రైజింగ్ సదస్సు (The Southern Rising Summit 2024)లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రైజింగ్ తెలంగాణ (Rising Telangana), రైజింగ్ హైదరాబాద్ (Rising Hyderabad) లక్ష్యాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, ఫ్యూచర్ సిటీ ఆలోచనలను వివరించారు.సబర్మతి రివర్ ఫ్రంట్‌కు మద్దతునిస్తున్న వారు మూసీ పురుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు.మూసీ, ఈసా నదుల కలయిక ప్రాంతమైన బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమంగా గాంధీ స్మారకాన్ని నిర్మించతలపెట్టామన్నారు.తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ ప్రధానులు దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితాలను వివరించారు.బహుళార్థ సాధక ప్రాజెక్టులు, విద్య, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, 73-74 వ రాజ్యాంగ సవరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవం, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పన, తీసుకొచ్చిన  ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఏ విధంగా తోడ్పడిందీ విడమరిచారు.ఎంతో మంది యువకుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రగతి విషయంలో కొందరు  అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను... రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

]]>
Sat, 26 Oct 2024 22:55:18 +0530 admin
క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/క్రీడా-విధానానికి-సంబంధించిన-తుది-ముసాయిదాను-నవంబర్-నెలాఖరులోగా-సిద్ధం-చేయండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/క్రీడా-విధానానికి-సంబంధించిన-తుది-ముసాయిదాను-నవంబర్-నెలాఖరులోగా-సిద్ధం-చేయండి-రేవంత్-రెడ్డి క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో : 

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన యువత సత్తా చాటేలా తెలంగాణ క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ విధానంలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Physical Education and Sports University - YIPESU)కి సంబంధించిన బిల్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రూపొందించాలని చెప్పారు.మరో పది రోజుల్లోగా యంగ్ ఇండియా స్పోర్ట్ వర్సిటీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలన్నారు.అత్యుత్తమ క్రీడా విధానం కోసం ద‌క్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని, ఈ రంగంలో నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు జరపాలని చెప్పారు.రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్‌ను వెంట‌నే త‌యారు చేయాలన్నారు.వ‌చ్చే రెండేళ్ల‌లో నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌ను సంప్రదించాల‌ని ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే.కేశ‌వ‌రావు, క్రీడా స‌ల‌హాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , రాష్ట్ర క్రీడ‌ల శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి జయేశ్ రంజన్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sat, 26 Oct 2024 22:50:43 +0530 admin
వారం రోజుల్లో Young India Skills యూనివర్సిటీ భవన నిర్మాణానికి తుది రూపు ఇవ్వండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/వారం-రోజుల్లో-young-india-skills-యూనివర్సిటీ-భవన-నిర్మాణానికి-తుది-రూపు-ఇవ్వండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/వారం-రోజుల్లో-young-india-skills-యూనివర్సిటీ-భవన-నిర్మాణానికి-తుది-రూపు-ఇవ్వండి-రేవంత్-రెడ్డి వారం రోజుల్లో Young India Skills యూనివర్సిటీ భవన నిర్మాణానికి తుది రూపు ఇవ్వండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో 

తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి  మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ (MEIL_Group)కి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మెఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.అంతకుముందు ముఖ్యమంత్రి  మెఘా ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపారు.స్కిల్స్ వర్సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.ఈ క్యాంపస్‌లో అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తామని పీవీ కృష్ణారెడ్డి తెలిపారు.సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి  మెఘా కంపెనీకి  అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.హైదరాబాద్ శివారు కందుకూరు మండలంలో మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ శ్రేణి Young India Skills University నిర్మాణానికి గత ఆగస్టులోనే ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు.ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను నేటి  సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి   సూచించారు.డిజైన్లకు తుది రూపం ఇచ్చి నవంబర్ 8 వ తేదీన యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Sat, 26 Oct 2024 22:46:07 +0530 admin
బంజారా జీవితంతో ముడి పడిన... ఘుగర (మువ్వ)ల సవ్వడి https://prajakshethrenews.com/బంజారా-జీవితంతో-ముడి-పడిన-ఘుగర-మువ్వల-సవ్వడి https://prajakshethrenews.com/బంజారా-జీవితంతో-ముడి-పడిన-ఘుగర-మువ్వల-సవ్వడి బంజారా జీవితంతో ముడి పడిన... ఘుగర (మువ్వ)ల సవ్వడి 

ప్రాచీన కాలం నుంచి మొదలుకొని నేటి వరకు గజ్జెలు (మువ్వలు) మన జీవన విధానంలో ఎనలేని మనుగడను కొనసాగిస్తున్నాయి. పశుపక్ష్యాదులు మొదలుకొని, పసిపాప ప్రాయం నుంచి వృద్ధ్యాప్యం దాకా మువ్వలతో వున్న అనుబందం విడదీయలేనిది. కోడిపుంజు కాళ్ల నుంచి... లేగ దూడ మెడ వరకు పసిపాపగా వేసే మొదటి అడుగు నుంచి.. భర్తతో వేసే చివరి అడుగు వరకు బంజార ప్రజల జీవితంలో మువ్వ/ గజ్జెలకు ఉన్న ప్రాముఖ్యత వైవిధ్యమైనది.

ఛమ్క్య  ఘుగర పేరి... ఛమ్మ్​ ఛమ్మ్​ నాచుకన్ 

ఝంజరియ పేరి.. జవాని ఉమర్ అయికన్ 

గోళ్ ఘుగర పేరి.. గోల్ మాల్ న వేణోకన్... 

తీని రంగీర్ ఘుగర ఛూట్ చాలే... 

మారే వీరణారీ సోపతి ఛూట్ చాలీ... 

వాక్టీర్ బంధమేతి భందీ చాలీ.... 

ఓ ఘుగర మార్ బేటీ బేటార్ ఖుణ్ ఖుతియ మ బోలే కన్ మురిసి చాలీ... 

ఛమక్క్య ఘుగర, ఝూంజరియ, గోళ్ ఘుగర, వాంక్డ్ ఇలా బాల్య దశ నుంచి యవ్వన దశ, కౌమర దశ, వృద్యాప్యం దాకా బంజార భోరీకి గజ్జలతో ఉన్న అనుబందం విడదీయరానిది. బాల్య దశలో తండ్రి తన కూతురు ఛమక్క్య ఘుగరతో చేసే సవ్వడిని వింటూ మురి సిపోతాడు. తన బాధ గాధలను మరిచిపోయేలా తన కూతురిని...నాఛ్​ బాయి నాఛ్​ అంటూ పాట పాడుతూ ఆ మువ్వలు మరింత గా సవ్వడి చేసేలా ప్రోత్సహిస్తాడు. యవ్వన దశ ఆరంభంలో తన జీవితంలో చోటు చేసుకునే మార్పులకు, బాధ్యతలకు భయపడకుండా శరీర పరిపక్వతకు మునుపే మానసిక పరిపక్వతకు సంసిద్ధపరుస్తూ తల్లీ తన కూతురికి ఇచ్చే కానుకే 'ఝూంజరియ ఈ గజ్జెలు పూర్తిగా లోహంతో తయారు చేయబడి ఉంటాయి. లేత కాళ్లకు నొప్పిని, బొబ్బలను పరిచయం చేస్తాయి. అసౌకర్యంగానూ అనిపిస్తాయి. వాటన్నింటిని ఓర్చుకోవడం వల్ల ఊహించని మార్పులు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి అనే అనుభవ పాఠాలను ఈ ఝాంజరియ నేర్పిస్తాయి. కౌమర దశలో కానుకగా అందించే గోళ్ ఘుగర బంజార(ఛోరీ) అమ్మాయికి ఉద్వేగ పూరితమైన బహుమతిగా భావించబడతాయి. ఎందుకనగా అన్నదమ్ములు ప్రేమతో ఒక్కో గజ్జను తాడు సహాయంతో ప్రేమగా అల్లి తమ అక్క చెల్లికి 'గోళ్ ఘగర'తో పాటు ఇంటి పరువు, ప్రతిష్టను బాధ్యతగా అందిస్తారు. కౌమర దశలో ఉన్న తనపై తమ ఇంటి పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయని అంతటి బరువైన గోళ్ ఘుగరను తాను ధరించి సత్ప్ర వర్తనతో మొలుగుతూ మంచి పేరును తెచ్చుకోవాలని, ప్రేమతో కూడిన బాధ్యతను తన అన్నదమ్ముల చేతుల మీదుగా గోళ్ ఘుగర రూపంలో ఆనందంగా అందిపుచ్చుకుంటుంది. ఈ గోళ్ ఘుగరలు చాలా బరువుగా ఉంటాయి. తాను వేసే ప్రతి అడుగులో తనపై ఉన్న బాధ్యతను గుర్తుచేస్తూ ఉంటాయి. తన పెళ్లి సమయంలో తనను అత్తగారి ఇంటికి అప్పజెప్పే ముందు తనపై నమ్మకం ఉంచి తల్లిదండ్రుల గౌరవ మర్యాదలను తనకు అప్పగించి నందుకు గాను తన పుట్టింటి వారు ఆశించినట్లుగా పుట్టింటి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా నడుచుకొని ఆ బాధ్యతలను తిరిగి గోళ్ ఘుగర్ రూపంలో అన్నదమ్ములకు అందిస్తుంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో అత్యత్తమమైన ఘట్టం పెళ్లి. ఈ సమయంలో అన్నదమ్ములు తమ సోదరి తమ ఇంటి పరువు ప్రతి ష్టలను బాధ్యతగా కాపాడిందని గుర్తించి ఆ గోళ్ ఘుగరను ఎంతో భావోద్వేగంతో ఏడుస్తూ విప్పుతారు. ఈ సందర్భంగా పెళ్లికూతురు జీవితకాలం తాను వారికి సోదరి గానే ఉంటానని, తనకు ఆ గోళ్ ఘుగర బరువుగా లేవని. తనను పరాయి ఇంటికి పంపించకూడదని తన కుటుంబంతో ఉన్న అను బంధంలో వచ్చే మార్పులను తాను స్వాగతించనని, తనను వారి ప్రేమానురాగాలకు దూరంగా పంపించకూడదని, అంతటి మధుర మైన అనుబంధాన్ని విడదీయకూడదని ఏడుస్తూ తన భావాలను పాట (ఢావ్లో) రూపంలో వ్యక్తపరుస్తుంది. అన్నదమ్ములు ఘుగర విడిపించగా తనకు కాబోయే భర్త 'వాంక్డి'ని (ఇసుక రేణువుల్లాంటి చిన్న చిన్న మువ్వలు అమర్చబడి లోహంతో తయారు చేయబడినది) పెళ్లి కూతురు కాళ్లకు ఎక్కిస్తారు. ఈ వాంక్డిని  తిరిగి తన భర్త మరణం తరువాతనే తొలగిస్తారు. వాంక్డిని  స్వీకరించిన తాను అత్తింటి గౌరవ మర్యాదలను అనుగుణంగా అత్తింటి బాధ్యతలను స్వీకరించినట్లుగా భావిస్తుంది. ఛమక్క్య ఘుగర, ఝూంజరియ, గోళ్ ఘుగర తన మానసిక పరి పక్వతకు అర్థవంతమైన నడవడికకు ప్రోత్సహించడం ద్వారా తాను తన పుట్టింటి గౌరవ మర్యాదలను కాపాడటంలో గడించిన అనుభ వాల ఆధారంగా తన మెట్టినింటి పరువు ప్రతిష్టలను కాపాడాల్సిం దిగా... ఆ బాధ్యతలను అనుక్షణం గుర్తుంచుకునే లాగా ఘుగరను పెళ్లికూతురు (నవ్లేరి) కి తన వేషధారణలో భాగం చేస్తూ గ్లుంగ్టో టోప్లీ , కాళీ, ఖయ్య, తాక్లీ, పట్టిలలో మువ్వలను అమర్చుతారు. " కొత్త జీవితాన్ని స్వాగతిస్తూ పెళ్లికూతురు (నవ్లేరీ) వాటి బరువును ఆనందంగా ఆస్వాదిస్తుంది. అనుక్షణం తన అత్తింటి కట్టుబాట్లను గుర్తు చేసుకుంటూ వాటికి అనుగుణంగా సక్రమంగా నడుచుకుంటూ తాను అడుగులు వేసినప్పుడు మొదలైన మువ్వల సవ్వడి తన పిల్లల చేతిలో (ఖుణ్ ఖుణియ) గిలకగా మారి చేస్తున్న సవ్వడిని వింటూ ఆనందంగా తన జీవితంలో మువ్వలు / (గజ్జెల)కు ఉన్న అనుబంధం విడదీయలేనిది అనే విషయాన్ని గ్రహిస్తుంది.

బంజార చోరీ...

నేనావత్​ స్రవంతి 

జేఎల్​, ఇంగ్లీష్​ 

7‌‌093644541

]]>
Tue, 22 Oct 2024 14:41:50 +0530 admin
రూ.1000కోట్లు బిజినెస్ చేసిన పుష్ప 2 (Pushpa2)ప్రీ&రిలీజ్ బిజినెస్ https://prajakshethrenews.com/రూ1000కోట్లు-బిజినెస్-చేసిన-పుష్ప-2-pushpa2ప్రీ-రిలీజ్-బిజినెస్ https://prajakshethrenews.com/రూ1000కోట్లు-బిజినెస్-చేసిన-పుష్ప-2-pushpa2ప్రీ-రిలీజ్-బిజినెస్ రూ.1000కోట్లు బిజినెస్ చేసిన పుష్ప 2 (Pushpa2)ప్రీ-రిలీజ్ బిజినెస్

ప్రజా క్షేత్ర్, సినిమా : 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) క్రేజ్ రోజురోజుకి క్రేజ్ పెరిగి పోతుంది. రిలీజ్ కు ముందే ఇండియన్ టాప్ స్టార్స్ సైతం టచ్ చేయని రికార్డ్స్ పుష్ప -2 క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే పుష్ప 2 రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు ట్రేడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా పుష్ప 2 - ది రూల్ మూవీకి ట్రేడ్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో థియేట్రికల్ హక్కులు 375-400 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.600 కోట్లు పలికినట్లు సమాచారం.  మిగతా ఇండియా స్టేట్స్లో ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.100 కోట్లకు చేరుకోగా.. ఓవర్సీస్ రైట్స్ బిజినెస్ దాదాపు రూ.125 కోట్లు మేరకు ఉందని ట్రేడ్ నిపుణుల అంచనాలు వేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 600+ కోట్లు అని చెబుతున్నారు.ఓవర్ ఆల్ బిజినెస్ లో సౌత్ నుండి రూ.900 కోట్లతో ఆర్ఆర్ఆర్ టాప్ లో ఉంది. ఇప్పుడు ఆ సినిమా రికార్డ్ బ్రేక్ చేసి రూ.1000 కోట్ల బిజినెస్ చేసిన మూవీగా పుష్ప 2 నిలిచిందని ట్రేడ్ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. అలాగే రూ.65 కోట్లకు మ్యూజిక్ రైట్స్ ను, రూ. 85 కోట్లకు టెలివిజన్ హక్కులను, ఇక రూ.275 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి మొత్తంగా పుష్ప 2 - ది రూల్ యొక్క ప్రీ-రిలీజ్ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ 1025+ కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే పుష్ప 2 ఇండియన్ సినీ హిస్టరీలో ఆల్ టైమ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు.

]]>
Tue, 22 Oct 2024 13:59:38 +0530 admin
జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ https://prajakshethrenews.com/జర్నలిస్టుల-ఆరోగ్య-పథకాన్ని-అమలు-చేయాలని-మంత్రి-దామోదర-రాజనరసింహాతో-టీయూడబ్ల్యూజే-భేటీ https://prajakshethrenews.com/జర్నలిస్టుల-ఆరోగ్య-పథకాన్ని-అమలు-చేయాలని-మంత్రి-దామోదర-రాజనరసింహాతో-టీయూడబ్ల్యూజే-భేటీ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (JHS) సక్రమంగా అమలుకాక పోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహాను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. సోమవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ నె్తృత్వంలో ప్రతినిధి బృందం బంజారా హిల్స్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో, మంత్రి దామోదర రాజనర్సింహాను, రాష్ట్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్.వి.కర్ణన్ ను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపై చర్చింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు EJHS పథకాన్ని ప్రవేశపెట్టి, హెల్త్ కార్డులు జారీ చేయగా, ఆ పథకం 2019వరకు సక్రమంగా పనిచేసిందని విరాహత్ అలీ తెలిపారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ గత ఐదేళ్లుగా వైద్యం కోసం జర్నలిస్టులు కార్పొరేట్ ఆసుపత్రులకెళ్తే హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐదేళ్ల కాలంలో వివిధ ప్రమాదాలు, కరోనా కాటు, ఆయా వ్యాధులకు గురై రాష్ట్రంలో దాదాపు 300మంది జర్నలిస్టులు అకాలమరణానికి గురైనట్లు ఆయన తెలిపారు. పథకం అమలుకాక పోవడంతో పలువురు జర్నలిస్టులు అప్పులు చేసి చికిత్స పొందుతున్నట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆరోగ్య పథకాన్ని పునరుద్దరించి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతా కల్పించాలని మంత్రి దామోదర రాజానరసింహాను కోరారు. మంత్రిని కలిసిన టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శులు వరకాల యాదగిరి, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, హెల్త్ కమిటీ కన్వీనర్ ఏ.రాజేష్, HUJ అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ లు ఉన్నారు.

*త్వరలో ఉన్నత స్తాయి సమావేశం*

*-మంత్రి దామోదర రాజనరసింహా*

ఆరోగ్య పథకం విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలుచేసే విషయంలో త్వరలో శాఖా పరంగా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి చర్చిస్తామని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి దామోదర రాజనరసింహా హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని ట్రస్ట్ ద్వారనైనా, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారనైనా నిర్వహించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధికారులతో సమావేశమై, తదుపరి జర్నలిస్టు, ఉద్యోగ సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

]]>
Mon, 21 Oct 2024 22:12:48 +0530 admin
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/శాంతి-భద్రతలకు-విఘాతం-కలిగించేవారిపై-కఠినంగా-వ్యవహరించండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/శాంతి-భద్రతలకు-విఘాతం-కలిగించేవారిపై-కఠినంగా-వ్యవహరించండి-రేవంత్-రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించండి : రేవంత్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్ , తెలంగాణ బ్యూరో

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనను ఉటంకిస్తూ, ప్రజల్లో విబేధాలు సృష్టించాలన్న సంఘ వ్యతిరేక శక్తుల చర్యలను నియంత్రించడంలో ప్రభుత్వం పోలీసులకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోషామహల్‌లో నిర్వహించిన ఫ్లాగ్ డే పరేడ్‌లో పాల్గొని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అమర పోలీసు కుటుంబాలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా ప్రగతి పథంవైపు నడవాలంటే శాంతి భద్రతలు పరిరక్షణ అత్యంత కీలకమని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అలాగే ఎవరో తప్పు చేశారని, వాళ్లను తామే శిక్షిస్తామని కొందరు శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో తప్పు చేసిన వారికి, చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్న వారికి మధ్య తేడా లేకుండా పోతుంది. తప్పు చేసే వారెవరైనా పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. శాంతి భద్రతలు, మత సామరస్యం కాపాడబడినప్పుడే మన పండుగలను గొప్పగా నిర్వహించుకోగలం. కొన్ని సందర్భాల్లో ఎలాంటి వసతి సౌకర్యాలు లేనప్పటికీ పోలీసులు హైదరాబాద్ నగరంలో మతసామరస్యాన్ని కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్నారు. బాధితుల విషయంలో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలే తప్ప క్రిమినల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. పోలీసు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు విధి నిర్వహణలో ప్రమాదాలకు లోనైనప్పుడు, అమరులైనా లేదా అంగవైకల్యం చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం పెంచుతున్నాం. పోలీసు శాఖ, సిబ్బంది పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. పోలీసులు ఆత్మగౌరవంతో బ్రతకాలి. మరొకరు చులకనగా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దు. సమాజంలో అందరికీ రక్షణ కల్పించే పోలీసుల గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. కొత్త కొత్త రూపాల్లో జరుగుతున్న నేరాలను అరికట్టడంలో గతంలో ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. హోం గార్డు నుంచి డీజీపీ వరకు పోలీసు కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూలును ప్రారంభిస్తున్నాం. ఎలాంటి లోటురాకుండా పోలీసు కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుంది.

]]>
Mon, 21 Oct 2024 20:22:04 +0530 admin
అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు పవన్​కళ్యాణ్ భరోసా https://prajakshethrenews.com/అతిసారం-బారినపడి-మృతి-చెందిన-కుటుంబాలకు-పవన్కళ్యాణ్-భరోసా https://prajakshethrenews.com/అతిసారం-బారినపడి-మృతి-చెందిన-కుటుంబాలకు-పవన్కళ్యాణ్-భరోసా అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు పవన్​కళ్యాణ్ భరోసా

ప్రజా క్షేత్ర్, ఏపీ బ్యూరో 

విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కలిసి, పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతిసార ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి విద్య బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏడుగురు మృతి చెందడం విచారకరమని, పలువురు ఆసుపత్రి పాలు కావడం ఆవేదన కలిగించిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా, నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. బాధితులు చెప్పిన విషయాలను ఓపికగా విని, సమస్యలను తీర్చేలా పని చేస్తామని భరోసా ఇచ్చారు. శుద్ధి చేసిన తాగునీరు ప్రతి కుటుంబానికి అందేలా 'జల జీవన్ మిషన్' పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్ధం అవుతుందని తెలియజేశారు.

]]>
Mon, 21 Oct 2024 20:11:08 +0530 admin
జీవితంలో రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేం : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/జీవితంలో-రిస్క్-తీసుకోకుండా-లక్ష్యాలను-సాధించలేం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/జీవితంలో-రిస్క్-తీసుకోకుండా-లక్ష్యాలను-సాధించలేం-రేవంత్-రెడ్డి జీవితంలో రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేం : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు 2024 లో పాల్గొన్న ముఖ్యమంత్రి లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు. హైదరబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టడంలో అందరి సహకారం కావాలని సదస్సులో కోరారు. దేశంలోని నగరాలతో కాకుండా, న్యూయార్క్, ప్యారిస్, టోక్యో , సియోల్‌ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి  చెప్పారు. ఐఎస్బీ విద్యార్థులు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు అని, తెలంగాణను ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యసాధనలో సహకరించాలని, వెళ్లే ప్రతి చోట తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచించారు.రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఒక రోల్ మాడల్ గా, గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి చెప్పారు.

]]>
Mon, 21 Oct 2024 03:10:29 +0530 admin
నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లోను తెలంగాణ పోలీసులు రాణించాలి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/నేషనల్-పోలీస్-డ్యూటీ-మీట్లోను-తెలంగాణ-పోలీసులు-రాణించాలి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/నేషనల్-పోలీస్-డ్యూటీ-మీట్లోను-తెలంగాణ-పోలీసులు-రాణించాలి-రేవంత్-రెడ్డి నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లోను తెలంగాణ పోలీసులు రాణించాలి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, క్రైం బ్యూరో :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజాబహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ వేడుకలో పోలీసులకు వారు దిశానిర్దేశం చేశారు.పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో అనుసరించాల్సిన విధి విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు. పోలీసు శాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతి పొందిన టీమ్‌కు రూ. 5 లక్షలు, రెండో బహుమతికి రూ3 లక్షలు, మూడో బహుమతిగా రూ. 1.5 లక్షల నగదు అవార్డును ప్రకటించారు.క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలంగాణ పోలీసు శాఖకు స్పూర్తినిచ్చే విధంగా డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ సందర్భంగా ఆ శాఖను అభినందించారు.నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో కూడా తెలంగాణ పోలీసులు రాణించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. దేశంలోనే మిగతా పోలీసులకు ఆదర్శంగా నిలువాలని కోరారు.సైబర్ క్రైమ్స్, మాదక ద్రవ్యాల రవాణా వంటి కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను అరికట్టడానికి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం.పోలీసు కుటుంబాల కష్టం, నష్టాన్ని గమనించే అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తున్నాం.శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నందునే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది.రాష్ట్రంలోకి గంజాయి లాంటి మత్తుపదార్థాలు సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 లో కాకినాడలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ తర్వాత తెలంగాణలో తొలిసారి డ్యూటీ మీట్ నిర్వహణకు అంగీకరించడంపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హోం సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ జితేంద్ర, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ (సీఐడీ) శిఖా గోయల్ , ఇతర ఉన్నతాధికారులు, వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు.

]]>
Sun, 20 Oct 2024 02:45:20 +0530 admin
ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడుతాం : రేవంత్​రెడ్డి https://prajakshethrenews.com/ఆర్థిక-మూలాలను-దెబ్బతీయాలనే-ఆర్థిక-ఉగ్రవాదుల-భరతం-పడుతాం-రేవంత్రెడ్డి https://prajakshethrenews.com/ఆర్థిక-మూలాలను-దెబ్బతీయాలనే-ఆర్థిక-ఉగ్రవాదుల-భరతం-పడుతాం-రేవంత్రెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడుతాం : రేవంత్​రెడ్డి 

ప్రజా క్షేత్ర్ , తెలంగాణ బ్యూరో 

మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టు, జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన హైడ్రా వ్యవస్థ రెండు వేర్వేరని విడమరిచి చెప్పారు.  మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీఎం  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. Rajiv Gandhi Sadbhavana అవార్డును మాజీ మంత్రి గీతారెడ్డి కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ... దేశ సమగ్రతను కాపడటానికి చేపట్టిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రను స్పూర్తిగా తీసుకుని మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ అభివృద్ధికి ముందుకు సాగుతాం. ట్రాఫిక్ నియంత్రణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుషితాలను నిలుపుదల చేయడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించడం వంటి ఎన్నో ప్రజాసౌలభ్యాల కోసం హైడ్రా పనిచేస్తుంది.  చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు, 111 జీవోను ఉల్లఘించిన వారు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారు. మదపుటేనుగులను అణచడానికి అంకుశం తరహాలో హైడ్రా పనిచేస్తుంది. అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సామాన్యులకు అండగా ఉంటాం.  మూసీ పునరుజ్జీవం, హైడ్రాను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. మురికికూపంలో నలిగిపోతున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించి వారి పిల్లలకు మంచి చదువులు అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాం.  హైదరాబాద్ నగరంలోని బోజగుట్ట ప్రాంత వాసుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 

]]>
Sun, 20 Oct 2024 00:25:37 +0530 admin
కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు https://prajakshethrenews.com/కొమురం-భీమ్-కు-సీఎం-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు https://prajakshethrenews.com/కొమురం-భీమ్-కు-సీఎం-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు కొమురం భీమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు కొమురం భీమ్​ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇతర ప్రతినిధులు ఉన్నారు.

]]>
Fri, 18 Oct 2024 02:46:49 +0530 admin
ఆదికవి వాల్మీకి సీఎం రేవంత్​ రెడ్డి ఘన నివాళులు https://prajakshethrenews.com/ఆదికవి-వాల్మీకి-సీఎం-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు https://prajakshethrenews.com/ఆదికవి-వాల్మీకి-సీఎం-రేవంత్-రెడ్డి-ఘన-నివాళులు ఆదికవి వాల్మీకి సీఎం రేవంత్​ రెడ్డి ఘన నివాళులు 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

ఆదికవి వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ఆ మహర్షి ని స్మరిస్తూ వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు వాల్మీకి మహర్షి కి పుష్పాంజలి ఘటించారు.

]]>
Fri, 18 Oct 2024 02:42:58 +0530 admin
మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/మూసీ-పునరుజ్జీవనం-చేయాలన్నది-ప్రభుత్వ-లక్ష్యం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/మూసీ-పునరుజ్జీవనం-చేయాలన్నది-ప్రభుత్వ-లక్ష్యం-రేవంత్-రెడ్డి మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం : రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

తెలంగాణ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ధేశించే కార్యాచరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం అయిదు ప్రముఖ సంస్థలతో కలిసిన కన్సార్షియమ్ కు పనులు అప్పగించినట్టు తెలిపారు. ఈ కన్సార్షియమ్ వచ్చే 18 నెలల్లో డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (#DPR), ప్రాజెక్టుకు కావలసిన నిధులు, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను  అధ్యయనం చేసి నివేదిస్తుందని చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి  సచివాలయంలో మీడియా సమావేశంలో సమగ్రంగా వివరించారు. అనేక సందేహాలను నివృతి చేశారు. ప్రజల్లో అపోహలు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది మూసీ సుందరీకరణ కాదు. ఇది మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంపిక చేసిన కన్సార్షియమ్ లోని అయిదు కంపెనీలు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పూర్తి చేసిన అనేక కీలకమైన ప్రాజెక్టుల వివరాలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ఈ కన్సార్షియమ్ కోసం ప్రభుత్వం 141 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. 1.50 లక్షల కోట్ల రూపాయలంటూ జరుగుతున్నది కొందరు కావాలని చేస్తున్న ప్రచారం మాత్రమేనన్నారు. ఇంకా డీపీఆర్ పూర్తి కాలేదు. ఆరు నుంచి ఆరున్నర సంవత్సరాల్లో మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా కొందరు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మురికి కూపంగా మారిన మూసీ పరీవాహక ప్రాంతంలో దుర్భర జీవితం గడుపుతున్న వారిని ఆదుకుంటాం. మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నిర్వాసితులను అక్కున చేర్చుకోవాలన్నది ప్రభుత్వ సంకల్పం. నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రతిపక్షాలు సరైన సూచనలు, సలహాలతో ముందుకు రావాలి. అవసరమైతే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రత్యామ్నాయాలపై చర్చించడానికి సిద్ధం. ఎవరైనా ఎలాంటి ప్రతిపాదనలైనా ఇవ్వొచ్చు. అపోహలు, అనుమానాలు సృష్టించి గందరగోళ పరచొద్దు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో వస్తే ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మునుషులే కాదు వారి మనసులను కూడా గెలవాలి. మూసీ పునరుజ్జీవన కోసం సంప్రదింపులే ముఖ్యం. నిర్వాసితులకు అండగా నిలవడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటాం. పర్యావరణ వేత్తలు, విద్యా వేత్తలు, సంపాదకులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. బాధితులకు నష్టపరిహారం ఎంతమేరకు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలన్న అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్ష పార్టీలతో పాటు పాత్రికేయులు కూడా రాత పూర్వకంగా ప్రతిపాదనలు, సూచనలు చేయాలి. ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉంటే ముందుకు రండి. మాకు ప్రజలిచ్చిన బాధ్యతను గుర్తెరిగి పనిచేస్తున్నాం. హైడ్రాకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ముడిపెట్టొద్దు. సలహాలు, సూచనలు ఇవ్వకుండా కేవలం ప్రజల్లో అనుమానాలు, అపోహలు కలిగించొద్దు. మూసీ గర్భంలో కొందరు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం ఎక్కడా కూల్చివేతలకు పాల్పడలేదు. వారికి మంచి జీవితం కల్పించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే 1600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చాం. నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చెరువులు, కుంటలు, నాలాలు పోయాయి. మూసీని కూడా కాలగర్భంలో కలిపి చరిత్ర హీనులుగా మిగిలిపోదామా.... ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతో ముందుకొచ్చింది. భారీ వర్షాలొచ్చినప్పుడు ముంచెత్తిన వరదలతో బెంగళూరు, చెన్నై, వయనాడ్ లాంటి నగరాలు అతలాకుతలమైన పరిస్థితులను చూశాం. ఇటీవల ఖమ్మం, విజయవాడల్లో వచ్చిన వరదలు ఎలాంటి విపత్తును సృష్టించాయో కళ్లముందే ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా. ఈ ప్రాజెక్టు తెలంగాణలోని 4 కోట్ల ప్రజలను నిర్దేశించబోతోంది. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఈ మీడియా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, కన్సార్షియమ్ లోని ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Fri, 18 Oct 2024 02:18:40 +0530 admin
ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి https://prajakshethrenews.com/ఏపీజే-అబ్దుల్-కలాం-చిత్ర-పటానికి-సీఎం-రేవంత్-రెడ్డి-పుష్పాంజలి https://prajakshethrenews.com/ఏపీజే-అబ్దుల్-కలాం-చిత్ర-పటానికి-సీఎం-రేవంత్-రెడ్డి-పుష్పాంజలి ఏపీజే అబ్దుల్ కలాం చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రి కొండా సురేఖ , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి లు అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు.

]]>
Wed, 16 Oct 2024 01:41:16 +0530 admin
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/రక్షణ-శాఖ-మంత్రి-రాజ్-నాథ్-సింగ్-కు-స్వాగతం-పలికిన-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/రక్షణ-శాఖ-మంత్రి-రాజ్-నాథ్-సింగ్-కు-స్వాగతం-పలికిన-రేవంత్-రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంలో సీఎం తోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పూడురు మండలంలోని కార్యక్రమ స్థలికి బయలుదేరారు.

]]>
Wed, 16 Oct 2024 01:22:56 +0530 admin
దేశ భద్రత విషయాల్లో ఎక్కడా రాజీ పడబోం : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/దేశ-భద్రత-విషయాల్లో-ఎక్కడా-రాజీ-పడబోం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/దేశ-భద్రత-విషయాల్లో-ఎక్కడా-రాజీ-పడబోం-రేవంత్-రెడ్డి దేశ భద్రత  విషయాల్లో ఎక్కడా రాజీ పడబోం : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత నావికాదళం విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుందని అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. VLF రాడార్ కేంద్రం వల్ల స్థానికులకు గానీ ఈ ప్రాంతానికి గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు.భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున నావికా దళం నిర్మించనున్న వీఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి , పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక అంశాలను వివరించారు.రక్షణ శాఖకు హైదరాబాద్ మొదటి నుంచి వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది. అనేక రక్షణ పరిశోధనా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి.రాజకీయాల్లో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.ఈ ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. రక్షణ శాఖ మంత్రి అడిగిన వెంటనే మేం కార్యాచరణను ముందుకు కొనసాగించాం.దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. ఈ ప్రాజెక్టు కారణంగా స్థానికులకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు.1990 లో తమిళనాడులో ఏర్పాటు చేసిన వీఎల్ఎఫ్ వల్ల ప్రజలకు, ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.ఇక్కడ 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. మందిరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి.నావికా దళం ఇక్కడ ఏర్పాటు చేసే విద్యా సంస్థల అడ్మిషన్లలో స్థానికులకు మూడింట ఒకవంతు అవకాశం కల్పించాలి.ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి  మద్దతునిస్తుంది.APJ Abdul Kalam జయంతి సందర్భంగా ఈ వీఎల్ఎఫ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  సంతోషం వ్యక్తం చేశారు. దీని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి  చూపిన చొరవను అభినందించారు.రక్షణ శాఖలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్స నాథ్ సింగ్  వివరించారు. నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠీ స్వాగతోపన్యాసం చేశారు.

]]>
Wed, 16 Oct 2024 01:17:19 +0530 admin
కొండా రెడ్డి పల్లి లో అభివృద్ధి పనులకు సీ ఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన https://prajakshethrenews.com/కొండా-రెడ్డి-పల్లి-లో-అభివృద్ధి-పనులకు-సీ-ఎం-రేవంత్-రెడ్డి-శంకుస్థాపన https://prajakshethrenews.com/కొండా-రెడ్డి-పల్లి-లో-అభివృద్ధి-పనులకు-సీ-ఎం-రేవంత్-రెడ్డి-శంకుస్థాపన కొండా రెడ్డి పల్లి లో అభివృద్ధి పనులకు సీ ఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు.రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ. 32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.రూ.70 లక్షలతో అధునాతన సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

]]>
Mon, 14 Oct 2024 12:43:05 +0530 admin
కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/కొండారెడ్డిపల్లి-దసరా-వేడుకల్లో-పాల్గొన్న-సీఎం-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/కొండారెడ్డిపల్లి-దసరా-వేడుకల్లో-పాల్గొన్న-సీఎం-రేవంత్-రెడ్డి కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం  రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి  ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

]]>
Mon, 14 Oct 2024 12:38:22 +0530 admin
తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించచేయడానికి అలయ్ బలయ్' గొప్ప వేదిక https://prajakshethrenews.com/తెలంగాణ-సంస్కృతి-నలు-దిశలా-వ్యాపించచేయడానికి-అలయ్-బలయ్-గొప్ప-వేదిక https://prajakshethrenews.com/తెలంగాణ-సంస్కృతి-నలు-దిశలా-వ్యాపించచేయడానికి-అలయ్-బలయ్-గొప్ప-వేదిక తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించచేయడానికి అలయ్ బలయ్' గొప్ప వేదిక

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాడు రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు, సకల జనులు ఉద్యమంలో కార్యోన్ముఖులు కావడానికి కూడా అలయ్ బలయ్ ఒక కారణమని గుర్తుచేశారు. తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.గత 19 ఏండ్లుగా ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను పునరుద్దరించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలాగే అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ  గుర్తుకొస్తారు. దత్తాత్రేయ వారసురాలిగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న  బండారు విజయలక్ష్మికి అభినందనలు. ప్రజా ప్రభుత్వం, పార్టీ పెద్దలంతా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యత అని చాటి చెప్పాం.ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో పాటు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్, రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ కిషన్‌రావ్ బాగ్డే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర తదితరులు పాల్గొన్నారు.

]]>
Mon, 14 Oct 2024 12:35:31 +0530 admin
ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ నియామకం https://prajakshethrenews.com/ఏక-సభ్య-న్యాయ-కమిషన్-చైర్మన్-గా-తెలంగాణ-హైకోర్టు-మాజీ-జడ్జి-డాక్టర్-జస్టిస్-షహీమ్-అఖ్తర్-నియామకం https://prajakshethrenews.com/ఏక-సభ్య-న్యాయ-కమిషన్-చైర్మన్-గా-తెలంగాణ-హైకోర్టు-మాజీ-జడ్జి-డాక్టర్-జస్టిస్-షహీమ్-అఖ్తర్-నియామకం ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ నియామకం 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం ఏర్పాటైన ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా జస్టిస్ షహీమ్ అఖ్తర్ కమిషన్‌ వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయాల్సిఉంది. రెండు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించాలని, 24 గంటల్లోగా కమిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం తెలిసిందే.

]]>
Sat, 12 Oct 2024 03:20:01 +0530 admin
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం https://prajakshethrenews.com/యంగ్-ఇండియా-స్కిల్స్-యూనివర్సిటీ-yisu-అడ్మిషన్ల-ప్రక్రియ-ప్రారంభం https://prajakshethrenews.com/యంగ్-ఇండియా-స్కిల్స్-యూనివర్సిటీ-yisu-అడ్మిషన్ల-ప్రక్రియ-ప్రారంభం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా కొన్ని కోర్సులకు యూనివర్సిటీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీచేసింది.తొలి విడతగా యూనివర్సిటీ ప్రాథమికంగా మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ (https://yisu.in/)  ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది. నవంబర్ 4 వ తేదీ నుంచి ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహిస్తారు.

]]>
Sat, 12 Oct 2024 03:16:10 +0530 admin
ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన https://prajakshethrenews.com/ఇంటిగ్రేటెడెట్-రెసిడెన్షియల్-స్కూల్-నిర్మాణానికి-ముఖ్యమంత్రి-శంకుస్థాపన https://prajakshethrenews.com/ఇంటిగ్రేటెడెట్-రెసిడెన్షియల్-స్కూల్-నిర్మాణానికి-ముఖ్యమంత్రి-శంకుస్థాపన ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తండాలు, మారుమూల పల్లెలు, బస్తీల్లో నివసించే నిరుపేదలకు మంచి వైద్యం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నిరుపేదలను విద్యకు దూరం చేయకూడదన్న ఆలోచనతో చాలా మంది మేధావులు, సామాజిక తత్వవేత్తలతో చర్చించిన మీదట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.దసరా పండుగ శుభ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గ్‌లో ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదిక నుంచి మాట్లాడుతూ ఆ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరు చోట్ల విద్యా బోధన వల్ల ఈ వ్యవస్థ మమ్మల్ని దూరం పెడుతుందన్న  భావన విద్యార్థుల్లో కలిగే ప్రమాదం ఉంది. అలాంటి భావన సమాజానికి, దేశానికి మంచిది కాదు. అందుకే పాతిక ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అందరూ కలిసిమెలిసి ఒక సోదర భావంతో చదువుకుని రాణించాలన్న సంకల్పంతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.నిరుపేదలకు అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు  కల్పించడానికి ఒక్కోచోట 120 నుంచి 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ క్యాంపస్‌లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్‌లో దాదాపు 2500 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుని, భవిష్యత్తులో వారంతా ఉన్నతస్థాయికి ఎదగాలని, తద్వారా వారు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.నిరుపేదలను విద్యకు దూరం చేస్తే ఈ దేశ సంపదకే తీవ్ర నష్టం చేసిన వారమవుతాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో దాదాపు 5 వేల పాఠశాలలు మూసివేయబడ్డాయి. తద్వారా ముఖ్యంగా దళితులు, గిరిజనులు విద్యకు దూరమయ్యే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.పేదల కోసం పనిచేసే అధికారులను తప్పనిసరిగా ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడూ అభినందిస్తారు. విద్యా ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతోనే సుదీర్ఘ కాలంగా ప్రమోషన్లు లేక ఆందోళనకు గురవుతున్న సందర్భంలో రాష్ట్రంలో 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించడమే కాకుండా ఎక్కడా వివాదాలకు తావులేకుండా 34 వేల మంది టీచర్లను బదిలీలు చేశాం.ఈ శంకుస్థాపన కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు."భగవంతుడు ప్రజలకు సుఖశాంతులు కలిగించాలి. పాడిపంటలు ఇవ్వాలని, పిల్లలకు మంచి చదువులు, ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.

]]>
Sat, 12 Oct 2024 03:07:34 +0530 admin
శ్రీ మహిషాసుర మర్దని దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు. https://prajakshethrenews.com/శ్రీ-మహిషాసుర-మర్దని-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-మహిషాసుర-మర్దని-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-మహంకాళి-అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దని దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు.

]]>
Fri, 11 Oct 2024 21:24:08 +0530 admin
శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చిన మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గా-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-మీరాలం-మండి-శ్రీ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గా-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-మీరాలం-మండి-శ్రీ-మహంకాళి-అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదివ రోజు శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చిన మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారు

]]>
Fri, 11 Oct 2024 13:00:12 +0530 admin
అలయ్ బలయ్ లో పాల్గొనాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం https://prajakshethrenews.com/అలయ్-బలయ్-లో-పాల్గొనాలని-ముఖ్యమంత్రికి-ఆహ్వానం https://prajakshethrenews.com/అలయ్-బలయ్-లో-పాల్గొనాలని-ముఖ్యమంత్రికి-ఆహ్వానం అలయ్ బలయ్ లో పాల్గొనాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం 

ఈ నెల 13 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. వారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

]]>
Fri, 11 Oct 2024 04:00:32 +0530 admin
ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలు https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-నిర్ణయం-పట్ల-హర్షం-వ్యక్తం-చేస్తున్న-బీసీ-సంక్షేమ-సంఘం-నేతలు https://prajakshethrenews.com/ముఖ్యమంత్రి-నిర్ణయం-పట్ల-హర్షం-వ్యక్తం-చేస్తున్న-బీసీ-సంక్షేమ-సంఘం-నేతలు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలు 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సంఘం నాయకులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ప్రభుత్వ నిర్ణయంపై వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు తో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.

]]>
Fri, 11 Oct 2024 03:57:59 +0530 admin
ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ఆదాయ-పెంపు-మార్గాలపై-దృష్టిని-సారించండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ఆదాయ-పెంపు-మార్గాలపై-దృష్టిని-సారించండి-రేవంత్-రెడ్డి ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించండి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

]]>
Fri, 11 Oct 2024 03:41:37 +0530 admin
రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపనకు హాజరు కావాలని సీ ఎం రేవంత్ రెడ్డికి వినతి https://prajakshethrenews.com/రాడార్-ప్రాజెక్ట్-పనుల-శంకుస్థాపనకు-హాజరు-కావాలని-సీ-ఎం-రేవంత్-రెడ్డికి-వినతి https://prajakshethrenews.com/రాడార్-ప్రాజెక్ట్-పనుల-శంకుస్థాపనకు-హాజరు-కావాలని-సీ-ఎం-రేవంత్-రెడ్డికి-వినతి రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపనకు హాజరు కావాలని సీ ఎం రేవంత్ రెడ్డికి వినతి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం (Indian Navy) వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం అందించారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, నేవీ ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.

]]>
Fri, 11 Oct 2024 03:37:28 +0530 admin
శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గా-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-దుర్గా-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదివ రోజు శ్రీ దుర్గా దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారు

]]>
Fri, 11 Oct 2024 02:53:31 +0530 admin
శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ జమ్మి చెట్టు దుర్గా మాత https://prajakshethrenews.com/శ్రీ-దుర్గాదేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-జమ్మి-చెట్టు-దుర్గా-మాత https://prajakshethrenews.com/శ్రీ-దుర్గాదేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-జమ్మి-చెట్టు-దుర్గా-మాత శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ జమ్మి చెట్టు దుర్గా మాత

]]>
Fri, 11 Oct 2024 02:47:58 +0530 admin
తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోండి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-లో-ఎస్సీ-వర్గీకరణపై-సుప్రీంకోర్టు-తీర్పు-అమలు-బీసీ-కులగణన-పూర్తి-చేయడానికి-స్పష్టమైన-చర్యలు-తీసుకోండి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/తెలంగాణ-లో-ఎస్సీ-వర్గీకరణపై-సుప్రీంకోర్టు-తీర్పు-అమలు-బీసీ-కులగణన-పూర్తి-చేయడానికి-స్పష్టమైన-చర్యలు-తీసుకోండి-రేవంత్-రెడ్డి తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోండి : రేవంత్ రెడ్డి 

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ఏక సభ్య న్యాయ కమిషన్‌ ద్వారా వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయించాలని చెప్పారు.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించాలని, అంతేకాకుండా 24 గంటల్లోగా కమిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.నిర్దేశించిన రెండు నెలల గడువులోగా కమిషన్ తన రిపోర్టు సమర్పించాలంటూ పలు సూచనలు చేశారు.2011 తర్వాత జన గణన జరగని కారణంగా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా అధ్యయనం జరగాలి. క్షేత్రస్థాయి విజ్ఞాపనలు, ఫిర్యాదుల కోసం కమిషన్ జిల్లాల్లో పర్యటించాలి.ఏకసభ్య న్యాయ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి.తెలంగాణ‌లో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాలి. బీసీ క‌మిష‌న్‌కు తక్షణం అవసరమైన యంత్రాంగం సమకూర్చాలి. 60 రోజుల్లోగా సామాజిక‌, ఆర్థిక స‌ర్వే పూర్తి చేసి డిసెంబ‌రు 9 లోపు నివేదిక స‌మ‌ర్పించాలి. ఈ స‌ర్వే పూర్త‌యితే వెంట‌నే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లకు వెళ్లాలి.

]]>
Thu, 10 Oct 2024 04:41:36 +0530 admin
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలి : రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ప్రభుత్వ-పాఠశాలల్లో-చదివిస్తున్నామని-గర్వంగా-చెప్పుకునే-రోజులు-తెలంగాణలో-రావాలి-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ప్రభుత్వ-పాఠశాలల్లో-చదివిస్తున్నామని-గర్వంగా-చెప్పుకునే-రోజులు-తెలంగాణలో-రావాలి-రేవంత్-రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలి : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులంతా భవిష్యత్తు తరాలకు నిర్మాతలుగా అంకితభావంతో పని చేయాలని కోరారు.ఎల్బీ స్టేడియం వేదికగా DSC2024 రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఇతర మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు.భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ లాంటి ఎందరో మహామహులను తీర్చిదిద్దినవి  ప్రభుత్వ పాఠశాలలేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని చెబుతూ, ఈ సందర్భంగా సీఎంగారు ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.“విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో బాధ్యతాయుతమైన భావి పౌరువులుగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మానవీయ విలువలతో మెలిగే భవ్య సమాజ నిర్మాణంలో నావంతు పాత్ర నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని డీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు ప్రతినబూనారు.ప్రభుత్వ పాఠాశాల ప్రాధాన్యతను గుర్తించే ఇచ్చిన మాట ప్రకారం మీ కుటుంబాల్లో దసరా పండుగ సంతోషాలు నింపాలని నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోగా నియామకాలు పూర్తి చేశాం.ప్రభుత్వ రంగంలోని 30 వేల పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేటు రంగంలో 10 వేల పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటేనే నమోషీగా భావిస్తున్న పరిస్థితిపై అందరూ ఆలోచించాలి.ప్రభుత్వ పాఠశాలల్లో చదివామని గర్వంగా చెప్పుకునేలా ప్రైవేటు సంస్థలతో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నాం.తొలిదశలో 5 వేల కోట్లు వెచ్చించి, 25 నియోజకవర్గాల్లో సకల వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌కు ఈనెల 11న శంకుస్థాపన చేయబోతున్నాం.నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారి సారథ్యంలోని విద్యా కమిషన్ చేసే సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేస్తాం.ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించిన బదిలీలు, ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాం. ఎక్కడా చిన్న వివాదం లేకుండా 34 వేల మంది టీచర్లకు బదిలీలు చేయడంతో పాటు 21 వేల మందికి ప్రమోషన్లు కల్పించాం.తెలంగాణ భావితరాలను అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత యువతరం టీచర్లదే. ఆ టీచర్లకు కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది.యువత మాదకద్రవ్యాలకు, వ్యసనాలకు బానిసలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

]]>
Thu, 10 Oct 2024 04:36:18 +0530 admin
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి : దిగ్ర్భాంతి కి గురైన రేవంత్ రెడ్డి https://prajakshethrenews.com/ప్రముఖ-పారిశ్రామిక-వేత్త-రతన్-టాటా-మృతి-దిగ్ర్భాంతి-కి-గురైన-రేవంత్-రెడ్డి https://prajakshethrenews.com/ప్రముఖ-పారిశ్రామిక-వేత్త-రతన్-టాటా-మృతి-దిగ్ర్భాంతి-కి-గురైన-రేవంత్-రెడ్డి ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి :  దిగ్ర్భాంతి కి గురైన రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మృతి చెందారు. రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా  ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా వారు ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

]]>
Thu, 10 Oct 2024 04:30:01 +0530 admin
శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జమ్మిచెట్టు దుర్గా మాత అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-సరస్వతీ-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-జమ్మిచెట్టు-దుర్గా-మాత-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-సరస్వతీ-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-జమ్మిచెట్టు-దుర్గా-మాత-అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జమ్మిచెట్టు దుర్గా మాత అమ్మవారు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జమ్మిచెట్టు దుర్గా మాత అమ్మవారు

]]>
Thu, 10 Oct 2024 00:13:51 +0530 admin
శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-సరస్వతి-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీ-సరస్వతి-దేవి-అలంకారంలో-దర్శనమిచ్చిన-ఉప్పుగూడ-శ్రీ-మహంకాళి-అమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారు 

]]>
Wed, 09 Oct 2024 17:06:56 +0530 admin
శ్రీలలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మీరాలం మండి అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీలలితా-త్రిపుర-సుందరి-అలంకారంలో-భక్తులకు-దర్శనమిచ్చిన-మీరాలం-మండి-అమ్మవారు https://prajakshethrenews.com/శ్రీలలితా-త్రిపుర-సుందరి-అలంకారంలో-భక్తులకు-దర్శనమిచ్చిన-మీరాలం-మండి-అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మీరాలం మండి అమ్మవారు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్​ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో  శ్రీలలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన మీరాలం మండి అమ్మవారు

]]>
Tue, 08 Oct 2024 14:04:49 +0530 admin