గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి

గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి

 గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి


ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

ఇటీవల గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని బాధిత కుటుంబానికి చెందిన సంతోష్ గుప్తా కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గోషామహల్ నివాసి శ్రీనివాస్, న్యాయవాది అతుల్ అగర్వాల్ తో కలిసి మాట్లాడారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే  (17) మంది ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం తమను తీవ్రంగా కలిసి వేస్తుందని అన్నారు. ఘటన జరిగిన గంట వరకు అగ్నిమాపక శాఖ వాహనాలు రాకపోవడం వచ్చిన వాహనాల్లో సరైన సిబ్బంది నీటి సదుపాయం లేకపోవడంతోనే మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.  ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచి వేసిందని అన్నారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన అనంతరం ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యంతో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం జ్యూడిషియల్ ఎంక్వయిరీ ఆదేశించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు..