అఫ్గాన్లో భూకంపం.. 625 కు చేరిన మృతులు
అఫ్గాన్లో భూకంపం.. 625 కు చేరిన మృతులు
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 500కు చేరింది. యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.