ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ
* బీజేపీ గెలిస్తే ఓటు చోరీ, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాదా? ఇదేం తీరు?
* కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రజాకార్ల వారసుల కాళ్లు పట్టుకుని దాసోహం అవుతోంది
* కాంగ్రెస్‌కి మెజారిటీ లేకపోయినా, తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది బీజేపీ మద్దతుతోనే.
 * సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నాయకుల కృషి వల్లే తెలంగాణా సాధ్యమైంది
* గతంలో నిజాం రాజు గొప్పోడు అని కేసీఆర్ పొగిడారు.
* తెలంగాణ ప్రజలపై నరమేధం చేసిన నిజాం ఎలా గొప్ప పాలకుడు?
* బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి బిజెపి తెలంగాణ అధ్యక్షులు  ఎన్. రాంచందర్‌ రావు డిమాండ్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ (నల్గొండ) :
సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం  నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో బిజెపి తెలంగాణ అధ్యక్షులు ఎన్.రాంచందర్‌ రావు  నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వ పాలనలో గుండ్రాంపల్లిలో 26 మందిని రజాకార్లు దారుణంగా హతమార్చి బావిలో పడేసిన ఘటన మనకు మరిచిపోలేని విషాద ఘట్టం. ఆ అమరవీరుల, త్యాగధనుల కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. గుండ్రాంపల్లి గ్రామం సాహస చరిత్రకు ప్రతీక. ఇక్కడికి రావడం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.హైదరాబాద్ స్టేట్‌కు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది.1947 ఆగస్టు 15న భారత్‌లో ఎక్కడైనా త్రివర్ణ పతాకం ఎగురుతుంటే, నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా భారత జెండా ఎగరలేదు. తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్నాటక జిల్లాలతో కూడిన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా ఉంచాలని చూశాడు. కుదరని పక్షంలో పాకిస్తాన్‌తో కలుపుకోవాలని ప్రయత్నించాడు.నిజాం నిరంకుశత్వాన్ని ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో ‘ఆపరేషన్ పోలో’ ద్వారా భారత సైన్యం హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేసింది. సెప్టెంబరు 17, 1948న తెలంగాణకు స్వాతంత్ర్యం లభించింది.ప్రజల ధైర్యం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ కఠిన నిర్ణయం, ‘ఆపరేషన్ పోలో’లో భారత సైన్యం వీరోచిత పోరాటం వల్లే 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది.ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సర్దార్ వల్లభభాయ్ పటేల్ కృషి కారణమే. వారికి మనమంతా రుణపడి ఉన్నాం.సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా జరపాలనే డిమాండ్ మొదట సీహెచ్. విద్యాసాగర్ రావు లేవనెత్తారు. ఆనాడు ఆయన సూచనతోనే అన్ని పార్టీ కార్యాలయాలకు ((కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం, ఆ తదనంతరం టీఆర్ఎస్) వెళ్లి ఈ చరిత్రను వివరించాను.నేడు ఆ కార్యాలయాల్లో మూడు రంగుల జెండా ఎగురవేసి "జనగణమన" పాడుతున్నామంటే అది విద్యాసాగర్ రావు కృషి ఫలితం అని అన్నారు.. అందులో నేను భాగస్వామి కావడం గర్వకారణంగా ఉంది.కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా విముక్తి దినోత్సవంగా జరుపుతున్నాయి. కానీ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు, తరువాత టీఆర్ఎస్–కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి.ఉద్యమ సమయంలో కేసీఆర్ సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుతానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రజల ఆకాంక్షను వమ్ము చేశారు.బీజేపీ మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతోంది.తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరగాలంటే.. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే నన్నారు.. అది ఖాయం.నిజాం వ్యతిరేక పోరాటంలో భైరాన్‌పల్లి బురుజు, పరకాల అమరధామం, నిజామాబాద్ జైలు, నిర్మల్ సహా అనేక ప్రదేశాలు కీలక ఘట్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.విమోచన దినోత్సవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ భయంతో పెట్టడం లేదు. ఖాసీం రజ్వీ, రజాకార్ల వారసులకు కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు కవలపిల్లలవంటివి.నిజాం పాలనలో జరిగిన అకృత్యాలు మరువలేనివి. రజాకార్లు గుండ్రాంపల్లిపై దాడి చేసి ప్రజలను నీరు లేని బావిలో పడేసి సామూహిక దహనం చేశారు.తెలంగాణ మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయి. ఒకేరోజు 96 మందిని హతమార్చారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది కానీ కాంగ్రెస్ ఆలస్యం వల్ల వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారన్నారు..తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాదు. సోనియమ్మ వందలాది యువకులను బలితీసుకుంది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు.బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ తెచ్చామని చెబుతోంది. కానీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వారి ఎంపీలు హాజరే కాలేదు.కాంగ్రెస్‌కి మెజారిటీ లేకపోయినా, బిల్లు ఆమోదం పొందింది బీజేపీ మద్దతుతోనే. సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ వంటి నాయకుల కృషి వల్లే సాధ్యమైంది.గతంలో నిజాం రాజు గొప్పోడు అని కేసీఆర్ పొగిడారు. కానీ తెలంగాణ ప్రజలపై నరమేధం చేసిన నిజాం ఎలా గొప్ప పాలకుడు? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన నిజాం తరహాలోనే నడుస్తోంది.కాంగ్రెస్ 42% ఇవ్వాల్సిన బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తోంది. ఎందుకంటే వారికి ఓవైసీల మద్దతు ముఖ్యం.తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత చేసిన పోరాటాన్ని మరచిపోతున్నారు.తెలంగాణ సంపదను దోచుకున్నది బీఆర్ఎస్. అదే మాట స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలే చెబుతున్నారు. తెలంగాణ సొమ్మును దోచుకున్న డబ్బును సరిగ్గా పంచుకోలేకపోవడంతో ఈరోజు ఆ కుటుంబంలో గొడవలు అవుతున్నాయి. తెలంగాణ ప్రజల సంపదను దోచుకుని పాలనను విస్మరించిన పార్టీ బీఆర్ఎస్.నేడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలెక్టర్లను బెదిరించి భూకబ్జాలు చేస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నిజంగా తెలంగాణ ప్రజల శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఉంటే, భారతదేశంపై గౌరవం ఉంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలి. లేకుంటే ఆ అర్హత మీకు లేదు.ఓటు దొంగతనం జరిగిందని, అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ. బీజేపీ గెలిస్తే ఓటు చోరీ, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాదా? ఇదేంటి తీరు?కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం రజాకార్ల వారసుల కాళ్లు పట్టుకుని దాసోహం అవుతోంది.త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ మజ్లిస్ పార్టీకి చెందిన ఇండ్లలో ఒక్కో ఇంటిలో 60 నుండి వందల దొంగ ఓట్లు ఉన్నాయని వాస్తవం.మజ్లిస్ గెలిచే 7 నియోజకవర్గాల్లో ఒక్కో ఇంట్లో వందల దొంగ ఓట్లు ఉన్నాయి. రోహింగ్యాలు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఇది అసలు ఓటు చోరీ.రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటూ అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అసలు ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ.హిందువులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుంటుంది. కానీ ముస్లింలకు మాత్రం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయ, మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటోంది.సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరిపి త్రివర్ణ పతాకం ఎగురవేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.తెలంగాణ విముక్తి చెంది భారతదేశంలో భాగమై, స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే దాని వెనుక అనేక మంది వీరుల త్యాగాలు ఉన్నాయి.అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ కృషి చేసింది, ఉద్యమించింది. తెలంగాణ విమోచన దినోత్సవం వల్లే తెలంగాణ ఉద్యమం కూడా బలపడింది.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను రాష్ట్రంలోని అన్ని మండలాల స్థాయిలో ఘనంగా జరుపుతోంది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను.