సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో దేవి నవరాత్రుల్లో మహాద్భుతం

సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో దేవి నవరాత్రుల్లో మహాద్భుతం

సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో దేవి నవరాత్రుల్లో మహాద్భుతం

సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న మహిళా భక్తులు

ఓ భక్తురాలి పళ్లెంలో పులి పాదం ముద్రల దర్శనం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సుల్తాన్ షాహిలోని శ్రీ జగదాంబ దేవాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారి ఆధ్వర్యంలో మహిళాభక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేస్తుండగా ఓ భక్తురాలి పల్లెంలో పసుపుపై పులి పాదం ముద్రలు ప్రత్యక్షమయ్యాయి. దీంత పూజల్లో పాల్గొన్న మహిళ భక్తులందరూ భక్తిపారవశ్యంతో పులి పాదం గుర్తులను తిలకించారు. దేవి నవరాత్రుల సందర్భంగా అనునిత్యం సామూహిక కుంకుమార్చన సందర్భంగా మహిళలందరికీ దేవాలయం కమిటీ తరపున పూలు, పసుపు, కుంకుమ అందజేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.  కుంకుమార్చన పూర్తయిన అనంతరం మహిళా భక్తులందరూ తమ తమ పూజా సామాగ్రిని తిరిగి పూజారికి అప్పగించి వెళుతుంటారు. ఈ నేపధ్యంలోనే మహా అద్భుతం చోటుచేసుకుంది. ఓ భక్తురాలు తన పూజా సామాగ్రిని పూజారికి అప్పగిస్తున్న సమయంలో పులి పాదం ముద్రలు  దర్శనం ఇవ్వడంతో ఆ భక్తురాలుఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆలయ పూజారి దానిని పరిశీలించి శ్రీ జగదాంబికా అమ్మవారు పులిపై స్వారీ చేస్తూ భక్తులకు ఈ విధంగా దర్శనమిచ్చిందని పేర్కొన్నారు.