సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ


ప్రజా క్షేత్ర్, అమరావతి :

 సచివాలయం 5 బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అధ్యక్షత రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి న సీఎస్ కే.విజయానంద్, ఎస్ఎల్ బీసీ ఛైర్మన్ నితీష్ రంజన్, కేంద్ర ఆర్ధిక విభాగం, ఆర్బీఐ, నాబార్డు, సిడ్బీ, ఎగ్జిమ్  బ్యాంక్ ఇతర బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. ఖరీఫ్ సీజన్లో  రూ.1,80,540 కోట్ల రుణ లక్ష్యానికిగానూ  జూన్ నాటికి రూ.94,666 కోట్ల మేర రుణాలను  బ్యాంకులు ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు రూ.985 కోట్ల రుణాల్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.49,831 కోట్ల రుణం మంజూరు చేసాయి. విద్యారంగానికి రూ.252 కోట్లు, హౌసింగ్ కు రూ.1,146 కోట్ల రుణాలు మంజూరు చేసాయి. పునరుద్పాదక ఇంధన రంగానికి రూ.125 కోట్ల మేర రుణ మంజూరు, స్వయం సహాయ సంఘాలకు రూ.5,937 కోట్ల రుణాన్ని ఇచ్చాయి. ముద్రా రుణాల కింద రూ.3189 కోట్లు మంజూరు చేసాయి.