ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ప్రజా క్షేత్ర్, ఛత్తీస్గఢ్ జూలై :
ఛత్తీస్గఢ్ లోని నారాయణ్పూర్ జిల్లాలో మావోయిస్టుల కు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంబంధిత పోలీస్ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.అంబూజ్మడ్ రీజియన్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందడంతో శుక్రవారం ఛత్తీస్గఢ్ పోలీసులు, భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి.ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.