ఇక శ్రీశైలానికి తగ్గనున్న దూరం
ఇక శ్రీశైలానికి తగ్గనున్న దూరం
ప్రజా క్షేత్ర్, మహబూబ్ నగర్, ఆగస్టు 14 :
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 7,668 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియా మీదుగా ఈ కారిడార్ నిర్మించనుండటం వల్ల పర్యావరణపరంగా కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని స్వల్ప మార్పులతో ఈ ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్రం తుది ఆమోదం తెలిపే అవకాశముంది.ప్రతిపాదిత రహదారి పొడవు 54.915 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ రహదారి పొడవు 45.19 కిలోమీటర్లు కాగా, మిగిలిన 9.725 కిలోమీటర్ల మేర సాధారణ రోడ్డు ఉంటుంది. ఈ రహదారిని దాదాపు 30 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో 300 మీటర్ల మేర వయాడక్ట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ప్రారంభమై అమ్రాబాద్ మండలం మన్ననూరు, కుంచోనిమూల, దోమలపెంట గ్రామాల మీదుగా శ్రీశైలం పాతాళగంగ వరకు ఈ రహదారి విస్తరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దోమలపెంట-శ్రీశైలం మధ్య కృష్ణా నదిపై ఒక ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇరుకైన, ప్రమాదకరమైన ఘాట్ రోడ్లు, మలుపుల వల్ల వాహనాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ కొత్త కారిడార్ వల్ల ప్రయాణం సురక్షితంగా, వేగంగా ఉంటుంది. అంతేకాకుండా, నల్లమల అడవిలో వన్యప్రాణులు రహదారి ప్రమాదాల బారిన పడకుండా ఇది సహాయపడుతుంది.హైదరాబాద్-శ్రీశై
పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.