తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు నెలవారీ ₹25,000/- పెన్షన్ మంజూరు చేయాలి
తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు నెలవారీ ₹25,000/- పెన్షన్ మంజూరు చేయాలి
అర్హత ఉన్న ప్రతి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలి
ప్రజా పాలనలో మంత్రి వివేక్ కు తెలంగాణ ఉద్యమకారుల సంఘం వినతి పత్రం
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 7 :
;తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు ఉద్యమకారుల సంఘం చైర్మన్ బండి రమేష్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రతినిధి బృందం, ప్రజా పాలనలో బాగంగా బుదవారం గాంధి భవన్ లో మంత్రి వివేక్ కు తెలంగాణ ఉద్యమకారుల సంఘం వినతి పత్రం వినతి పత్రం సమర్పించింది. అర్హత ఉన్న ప్రతి పాల్గొనేవారికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలి. తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు నెలవారీ ₹25,000/- పెన్షన్ మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి. తెలంగాణ అమరవీరులు మరియు పోరాట యోధులను అధికారికంగా గుర్తించి సత్కరించాలి.తెలంగాణ పోరాటంలో గణనీయమైన పాత్ర పోషించిన అర్హులైన కార్యకర్తలందరికీ అదనపు సంక్షేమ ప్రయోజనాలు, అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమస్యలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలపాలి.