అలిపిరి మార్గంలో చిరుత సంచారం
అలిపిరి మార్గంలో చిరుత సంచారం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 350వ మెట్టు సమీపంలో చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అనంతరం భద్రతా సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు. దీంతో భక్తులతో గోవింద నామాలు చెప్పిస్తూ సిబ్బంది కొండపైకి పంపిస్తున్నారు. చిరుత కోసం గాలింపు చేపట్టారు. కాగా గతంలోనూ పలుమార్లు తిరుమలలో చిరుతలు సంచరించిన సంగతి తెలిసిందే.