రెండో రోజు మసులా బీచ్ ఫెస్ట్ కు పోటెత్తిన పర్యాటకులు
రెండో రోజు మసులా బీచ్ ఫెస్ట్ కు పోటెత్తిన పర్యాటకులు
గతంలో ఎన్నడూ లేని విధంగా మచిలీపట్నంకు తరలివచ్చిన ప్రజలు
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
ఫుడ్ కోర్టులు కిటకిట....సీ కయాకింగ్ కు ఆదరణ....వాలీబాల్ పోటీలను తిలకిస్తున్న ప్రజలు.... కబడ్డీకి పట్టం కడుతున్న ప్రజలు.... అమ్యూజ్ మెంట్ కు ఆదరణ.... ప్యారా గ్లైడింగ్ కు ఆదరణ.... హెలీ రైడ్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సాయంత్రం కురిసిన చిరుజల్లులతో ప్రజలు సేద తీరారు. చల్లని సాయంత్రం వేళ బీచ్ పరిసరాలు వర్షం రాకతో ఆహ్లాదంగా మారాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల రద్దీని గమనించి ఎక్కడికక్కడ సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది