సుప్రీంకోర్టుసిబ్బంది నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం
హర్షం వ్యక్తం చేసిన బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూలై 2 ;
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సిబ్బంది నియామకాలు మరియు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయడం ఒక చారిత్రక, ప్రగతిశీల నిర్ణయమని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పేర్కొన్నారు.భారత సుప్రీంకోర్టు తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయాన్ని బిజెపి ఎస్సీ మోర్చా హృదయపూర్వకంగా స్వాగతిస్తోందన్నారు.గత 75 ఏళ్లుగా అమలుకాకుండా ఉన్న కోటా విధానాన్ని, ఇప్పుడు పునరుద్ధరించడం చారిత్రక ఘట్టం. SCలకు 15% రిజర్వేషన్, STలకు 7.5% రిజర్వేషన్ కల్పించడం సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం దిశగా గొప్ప ముందడుగు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ సామాజిక న్యాయం కోసం కట్టుబాటుగా నిలుస్తోంది.బలహీన, పీడిత వర్గాలు, దళితులకు రాజకీయ మరియు ఆర్థిక ప్రాతినిధ్యం పెరగాలని బిజెపి నిరంతరం కృషి చేస్తోంది.ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో 10 మంది ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు, ఐదుగురు షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బోర్డులు, యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు గణనీయమైన ప్రాతినిధ్యం లభిస్తోంది.దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ ను , అనంతరం ఆదివాసీ సమాజానికి చెందిన ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ గారిదే నన్నరు .మోదీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, కార్పొరేట్ బోర్డుల్లో, విశ్వవిద్యాలయాల గవర్నింగ్ కౌన్సిల్లలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం పెరిగింది. భారతీయ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా, అత్యున్నత న్యాయ వ్యవస్థ రిజర్వేషన్లను తన కార్యాలయాల్లో అమలు చేయడం ఎంతో విశిష్టమైన, చారిత్రక పరిణామ మన్నారు.