అక్టోబరు 3 నుంచి శ్రీ మహంకాళి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : జనగామ మధుసూధన్గౌడ్

అక్టోబరు 3 నుంచి శ్రీ మహంకాళి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : జనగామ మధుసూధన్గౌడ్
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
పాతబస్తీ ఉప్పగూడలోని చారిత్రాత్మక శ్రీ మహంకాళి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూధన్గౌడ్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన బాలా త్రిపుర సుందరీ దేవి, బంగారు రంగు వస్త్రం, నైవేద్యం కట్టె పొంగలి, 4 వ తేదీన శ్రీ గాయత్రీదేవి పసుపురంగు వస్త్రం, పులిహోర నైవేద్యం, 5వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి, ఎరుపు రంగు వస్త్రం, నైవేద్యం అల్లం గారెలు, 6వ తేదీన శ్రీలలితా త్రిపుర సుందరి, కాషాయ రంగు వస్త్రం కొబ్బెర అన్నం నైవేద్యం, 7వ తేదీన శ్రీ మహాచండి దేవి, ఎరుపు రంగు వస్త్రం, నైవేద్యం పులిహోర ,బూరెలు, 8వ తేదీన శ్రీ మహాలక్ష్మిదేవి, గులాభి రంగు వస్త్రం, చక్కెర పొంగలి నైవేద్యం, 9వ తేదీన శ్రీ సరస్వతి దేవి, తెలుపురంగు వస్త్రం, పెరుగు అన్నం నైవేద్యం, 10వ తేదీన శ్రీ దుర్గా దేవి, ఆకుపచ్చరంగు వస్త్రం, నైవేద్యం కదంబం, 11వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని దేవి, నీలం రంగు, నైవేద్యం పాయసం, 12వ తేదీన శ్రీ రాజజేశ్వరి దేవి, బంగారు రంగు వస్త్రం, లడ్డులు నైవేద్యం, ఆయుధపూజ, శమిపూజ, అమ్మవారి విగ్రహ ఊరేగింపు ఆలయ పురవీధుల గుండా జరుగనుందన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలకు అత్యథిక సంఖ్యలో భక్తులు పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.