డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆరుగురు డ్రగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసారు. తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు. పట్టుబడ్డ కానిస్టేబుల్ నుండి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఓటీ అధికారులు వెల్లడించారు.
తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38) అద్దంకిమండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.