పాతబస్తీలో వాడవాడలా తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పాతబస్తీలో వాడవాడలా తెలుగుదేశం పార్టీ 43 వ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పాతబస్తీలో వాడవాడలా తెలుగుదేశం పార్టీ 43 వ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

పాతబస్తీ చాంద్రాయణగుట్టలో తెలుగుదేశం పార్టీ 43 వ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ సీనియర్​ నాయకులు గాజుల వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్  పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగు నాగేష్  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.  

గౌలిపురాలో....

అనంతరం యాకుత్ పుర  నియోజకవర్గంలోని  గౌలిపుర   డివిజన్ చౌరస్తా లో   బి. వై. శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాగునాగేష్​ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్​ను కట్​ చేశారు. 

మొఘల్​పురాలో ...

అలాగే చార్మినార్  నియోజకవర్గంలోని  మొఘల్ పుర  డివిజన్ లోని   జోగేందర్    సింగ్  ఆధ్వర్యంలో  చేపట్టిన  ఆవిర్భావ  దినోత్సవ వేడుకలకు నాగునాగేష్​ పాల్గొని, ముందుగా ఎన్టీఆర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురికి మిఠాయిలను పంచిపెట్టారు. 

బహదూర్​పురాలో ....

బహదూర్ పుర నియోజకవర్గంలోని  శ్యామ్ సుందర్   ఆధ్వర్యంలో  టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగ పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో టీడీపీ సీనియర్​ నాయకులు సమీయుద్దీన్  రఫిక్ , తయ్యాబా  తస్నీమ్,  సల్లా  రాజ్ కుమార్ , బి. వై.  శ్రీకాంత్ , గాజుల వెంకట్ రమణ,      వరుణ్  తేజ ,  యాదిలాల్ ,  యాదయ్య ,  సత్యకృష్ణ ,ఆర్.  అజయ్ , రవీందర్  గౌడ్ ,  అహ్మద్  షరీఫ్, రాజేందర్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.