పాతబస్తీలో వాడవాడలా తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పాతబస్తీలో వాడవాడలా తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు గాజుల వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగు నాగేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
గౌలిపురాలో....
అనంతరం యాకుత్ పుర నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ చౌరస్తా లో బి. వై. శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాగునాగేష్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ను కట్ చేశారు.
మొఘల్పురాలో ...
అలాగే చార్మినార్ నియోజకవర్గంలోని మొఘల్ పుర డివిజన్ లోని జోగేందర్ సింగ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నాగునాగేష్ పాల్గొని, ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురికి మిఠాయిలను పంచిపెట్టారు.
బహదూర్పురాలో ....
బహదూర్ పుర నియోజకవర్గంలోని శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగ పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సమీయుద్దీన్ రఫిక్ , తయ్యాబా తస్నీమ్, సల్లా రాజ్ కుమార్ , బి. వై. శ్రీకాంత్ , గాజుల వెంకట్ రమణ, వరుణ్ తేజ , యాదిలాల్ , యాదయ్య , సత్యకృష్ణ ,ఆర్. అజయ్ , రవీందర్ గౌడ్ , అహ్మద్ షరీఫ్, రాజేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.