పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ : రేవంత్ రెడ్డి

పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ : రేవంత్ రెడ్డి
పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ : రేవంత్ రెడ్డి

పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు.. ఒరిజినల్ సిటీ : రేవంత్ రెడ్డి 

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ బ్యూరో : 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోగానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల అత్యంత పొడవైన పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌ నిర్మితమైతే, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కిలోమీటర్ల మేర రెండో అతిపొడవైన  డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించామని, తద్వారా తమకు తామే పోటీ అని నిరూపించుకున్నట్టయిందన్నారు.నూతనంగా నిర్మించిన ఆరాంఘర్-జూపార్క్ 4కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ , స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్తో  కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలో రూ.301 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి సీఎం గారు మాట్లాడారు.