గోదావరి నదిలో8 మంది గల్లంతు

గోదావరి నదిలో8 మంది గల్లంతు

గోదావరి నదిలో8 మంది గల్లంతు

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ : 

జిల్లాలో 8 మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ముమ్మడివరం మండలం కమినిలంక వద్ద స్నానానికి 11 మంది గోదావరి నదిలో దిగి, లోతైన ప్రాంతం కావడంతో వీరిలో 8 మంది గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా బయటకొచ్చారు.ఈ 11 మంది కె.గంగవరం మండలం శురుల్లంకలో ఓ శుభకార్యానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్‌, సాయి, సతీశ్‌, మహేశ్‌, రాజేశ్, రోహిత్‌, మహేశ్‌గా గుర్తించారు.