గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పణ
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పణ
ప్రజా క్షేత్ర్, చార్మినార్ , జూలై
పాతబస్తీ గౌలిపురా శ్రీ మహాంకాళి మాతేశ్వరి భారత మాత దేవాలయం, శ్రీ కోటమైసమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎర్మని కైలాష్ గంగపుత్ర ఆధ్వర్యంలో గోల్కొండ శ్రీ జగదాంబ దేవాలయ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ముందుగా గౌలిపురా శ్రీ మహాంకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒగ్గు బ్యాండ్ మేళాలతో భారీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఆలయ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఎస్. ఆనంద్ రావు , ముఖ్య సలహాదారులు ఎస్. మల్లేశం గౌడ్ , కె. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , ప్రధాన కార్యదర్శి మధు సూదన్ గిరి , మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్, అలె జితేందర్, ఉపాధ్యక్షులు మామిడి కృష్ణ , బి. వై. శ్రీకాంత్ , ఎమ్. ప్రకాష్ , కె. ప్రకాష్ రాజ్ , కోశాధికారి బొడ్డు సాయి బాబ , వై. రాజు , పి. శంకర్ , రాము గౌడ్, ఎం. వినోద్, కె. శ్రీకాంత్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.