మోడీ 11సంవత్సరాల పాలన స్వర్ణయుగమే
మోడీ 11సంవత్సరాల పాలన స్వర్ణయుగమే
కేంద్రమంత్రి బండి సంజయ్
ప్రజా క్షేత్ర్, తిరుపతి :
అభివృద్ధి, సంక్షేమం, దేశభక్తి, నూతన ఆవిష్కరణలు నరేంద్ర మోడీ పాలనలో కనిపిస్తున్నాయి. మోడీ పాలనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మోడీ 11సంవత్సరాల పాలన స్వర్ణయుగమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
బుధవారం అయన తిరుపతిలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 11సంవత్సరాల పాలనపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. బండి సంజయ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. త్వరలోనే అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలతో కోట్లాది మంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎం ఆవాస్ యోజన, జన్ ధన్ అకౌంట్స్, ఆయుష్మాన్ భారత్, స్వనిధి, ముద్రయోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన నిధులను కేటాయిస్తున్నాం. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోమని అన్నారు.