మహానాడుకు సర్వం సిద్దం

మహానాడుకు సర్వం సిద్దం

మహానాడుకు సర్వం సిద్దం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పాలు చరిత్ర ఆత్మకు నిర్ణయాలకు వేదికగా నిలవనుంది తొలి రోజు 27వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ సంస్థాగత నిర్మాణం భవిష్యత్తు కార్య చరణతోపాటు తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలు పార్టీ ఆవిష్కరణ పార్టీ నియమాలతో పాటు వాటి సవరణలపై ప్రధాన చర్చ జరగనున్నది అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనతరం ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతిచెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. 11.30 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమాఖర్చుల నివేదిక సమర్పిస్తారు.